ఒకవైపు కోర్టులో విచారణ.. మరోవైపు భగీరథ్ కోసం పోలీసుల గాలింపు
- ముందస్తు బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు వాయిదా
- బాధితురాలి రెండు జనన ధ్రువపత్రాలపై స్పష్టత ఇవ్వాలన్న హైకోర్టు
- భగీరథ్ కోసం ఢిల్లీ, హైదరాబాద్లలో పోలీసుల గాలింపు
- భగీరథ్ను అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- బాధితురాలి వివరాలు పోస్ట్ చేస్తే పోక్సో కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక
బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును నేటికి (శుక్రవారం) వాయిదా వేసింది. ఈ సందర్భంగా బాధితురాలికి సంబంధించిన రెండు జనన ధ్రువపత్రాలలో ఏది సరైనదో తేల్చాలని సూచించింది. ముందస్తు బెయిల్కు సంబంధించిన ప్రధాన పిటిషన్పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
గురువారం జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం ముందు ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ తమ క్లయింట్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం అరెస్టు నుంచి రక్షణ మాత్రమే కోరుతున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వ తరఫున, బాధితురాలి తరఫున న్యాయవాదులు దీనిని వ్యతిరేకించారు. నిందితుడు పరారీలో ఉంటూ బెయిల్ కోరడం సరికాదని, బెయిల్ ఇస్తే సాక్షులను, బాధితురాలి కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, బాధితురాలి పక్షం వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
మరోవైపు, పరారీలో ఉన్న భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్లలో ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించి, పలు ఆధారాలు సేకరించారు. బాధితురాలి వయసు నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలో బాధితురాలి గుర్తింపును బయటపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద, ఇతర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
గురువారం జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం ముందు ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ తమ క్లయింట్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం అరెస్టు నుంచి రక్షణ మాత్రమే కోరుతున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వ తరఫున, బాధితురాలి తరఫున న్యాయవాదులు దీనిని వ్యతిరేకించారు. నిందితుడు పరారీలో ఉంటూ బెయిల్ కోరడం సరికాదని, బెయిల్ ఇస్తే సాక్షులను, బాధితురాలి కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, బాధితురాలి పక్షం వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
మరోవైపు, పరారీలో ఉన్న భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్లలో ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించి, పలు ఆధారాలు సేకరించారు. బాధితురాలి వయసు నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలో బాధితురాలి గుర్తింపును బయటపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద, ఇతర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.